Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత వెటరన్ క్రికెటర్, టీమ్ ఇండియా టర్బోనేటర్ క్రికెట్ అంశాలే కాదు సామాజిక సమస్యలపైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. తాజాగా మరోసారి ట్వీట్టర్లో ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన హర్బజన్ సింగ్.. ఈ సారి ఫిఫా ప్రపంచకప్ను తీసుకొని మనోన్మాదులపైకి దూస్రా సంధించాడు. 1991లో ఉద్బవించిన ఓ దేశం, కనీసం 50 లక్షల జనాభా కూడా లేని ఓ దేశం ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది, మనమేమో హిందూ ముస్లింలు అంటూ ఆడుకుంటున్నామని భజ్జీ అన్నాడు. ' 50 లక్షల జనాభా ఉన్న క్రోయేషియా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది. 135 కోట్ల జనాభా ఉన్న మనం హిందూ-ముస్లిం అంటూ ఆడుకుంటున్నాం. ఆలోచనలు మారితే దేశం మారుతుంది' అంటూ హర్భజన్ రాసుకొచ్చాడు.