Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిమ్నాస్ట్ దీప కోచ్ నంది
ముంబయి : రియో ఒలింపిక్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో భారత క్రీడాభిమానుల మనసు దోచుకున్న యువ జిమ్నాస్ట్ దీప కర్మాకర్. గాయంతో సుమారు రెండు సంవత్సరాలు జిమ్నాస్టిక్స్కు దూరమైన దీప.. శస్త్రచికిత్స తర్వాత గత నెలలోనే తొలిసారి పోటీలోకి ప్రవేశించింది. పునరాగమనంలోనే ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్లో స్వర్ణం సాధించిన దీప కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఏ భారత జిమ్నాస్ట్ ప్రపంచ వేదికపై పసిడి సాధించలేదు. కానీ గాయం నుంచి కోలుకుని, క్లిష్ట పరిస్థితుల్లో దీప అపూర్వ ప్రదర్శన చేసింది. దీంతో సహజంగానే ఆసియా గేమ్స్లో దీపపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిపై ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్పందించారు. ' ఆసియా గేమ్స్ను రెండో ఒలింపిక్స్కు పరిగణించవచ్చు. ఇక్కడ చైనా, జపాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఉబ్జెకిస్థాన్ జిమ్నాస్ట్లు పోటీ పడతారు. అత్యంత కఠినమైన పోటీ ఈ దేశాల జిమ్నాస్ట్లు ఇవ్వగలరు. అందుకు తొలుత మా లక్ష్యం ఆసియా గేమ్స్ ఫైనల్లోకి ప్రవేశించటం. పునరాగమనంలోనే పసిడి కొట్టడంతో దీప నుంచి పతకం ఆశించటం సాధారణమే. అది కచ్చితంగా నాపై, దీపపై మరింత ఒత్తిడి పెంచుతుంది. అయితే, మా గురి కచ్చితంగా పతకం సాధించాలనే లేదు. ముందుగా ఫైనల్లోకి చేరటం. ప్రణాళిక ప్రకారం సాగితే పసిడి సాధించటం. ఒక వేళ నిరాశ చెందినా, విలువైన అనుభవంతో ఇంటికి రావటమే' అని నంది తెలిపారు. 2016 ఒలింపిక్స్లో వాల్ట్ విభాగంలో దీప కర్మాకర్ నాల్గో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.