Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వియాత్నం ఓపెన్
హోచిమిన్హ్ సిటీ : భారత వర్థమాన షట్లర్ అజరు జయరాం సీజన్లో తొలి టైటిల్ ముంగిట నిలిచాడు. వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న జయరాం వియాత్నం ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ ఆటగాడు యు ఇగరషిపై గెలుపొందిన జయరాం నేడు టైటిల్ పోరులో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గాయంతో నిరుడు ఆటకు దూరమైన జయరాం పునరాగమంలో స్ఫూర్తిదాయక విజయాలు సాధించాడు. ఏడో సీడ్ జపాన్ కుర్రాడిపై 21-14, 21-9తో 34 నిమిషాల్లోనే గెలుపొందాడు. జులైలో వైట్ నైట్స్ ఫైనల్లోనూ ఆడిన జయరాం.. నేటి టైటిల్ పోరులో వరల్డ్ నం.79, ఇండోనేషియా షట్లర్ సెషర్ హిరెన్తో తలపడనున్నాడు.