Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన ఐఎస్ఎస్ఎఫ్
న్యూఢిల్లీ : 2020 టోక్యో ఒలింపిక్స్కు ముందు ప్రతిష్టాత్మకమైన సంయుక్త షూటింగ్ ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మేరకు శనివారం వియన్నాలో సమావేశ మైన ఐఎస్ఎస్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ సమావేశాలకు హాజరైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్కు ఈ మేరకు సమాచారం అందించారు. త్వరలోనే ఐఎస్ఎస్ఎఫ్ నుంచి అధికారికంగా సమాచారం ఇవ్వను న్నారు. టోక్యో ఒలింపిక్స్కు అర్హతగా భావించే ఈ టోర్నీలో రైఫిల్, పిస్టోల్, షాట్ గన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఒలింపిక్స్కు ముందు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ భారత్లో నిర్వహించటం షూటింగ్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి సూచిక మాత్రమే కాదు ఒలింపిక్స్లో మన షూటర్లకు కొండంత మనోధైర్యం సాధించేందుకు ఇది తోడ్పాటు నందిస్తుందని రణీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని డా. కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్ ఈ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నది.