Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టు ఎంపికపై గవాస్కర్ మండిపాటు
లండన్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా నాయకత్వం వరుస వ్యూహాత్మక తప్పిదాలపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వేలెత్తి చూపిస్తున్నాడు. తొలి టెస్టుకు ముందు కేవలం మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్తోనే సరిపెట్టిన టీమ్ ఇండియా, తద్వారా బర్మింగ్హామ్లో 31 పరుగులతో ఓటమి పాలయ్యేందుకు స్వయంకృతాపరాధమే అని గవాస్కర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా లార్డ్స్ టెస్టులో తుది జట్టు ఎంపికపై గవాస్కర్ కెప్టెన్ కోహ్లి ఆలోచన ధోరణిని ప్రశ్నించాడు. ' ధావన్ ప్రతిసారీ తొలి టెస్టు తర్వా త తొలగించబడుతున్నాడు అదే నేను అడుగుతు న్నాను. బర్మింగ్హామ్లో విజరు, రాహుల్లు కలిపి 46పరుగులు చేశారు. కానీ అక్కడ శిఖర్ ధావన్ ఒక్కడే 39పరుగులు సాధించాడు. అటు వంటప్పుడు జట్టు ఎంపికకు ఏది ప్రాతిపదిక. మిగతా ఆటగాళ్లకు రెండో అవకాశం లభిస్తున్నప్పు డు, ధావన్కు ఎందుకు మరో చాన్స్ ఇవ్వరు? అని సన్నీ ప్రశ్నించాడు. ఎడం చేతి వాటం బ్యాట్స్మన్ ధావన్ జట్టులో వైవిధ్యం తేగలడు. ఒక వేళ ధావన్ కుడి చేతి వాటం అయితే, కుర్రాడు రాహుల్తో వెళ్లాలనుకోవటాన్ని అర్థం చేసుకో గలను. అతడిని తుది జట్టులో ఉండనీయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో భారత్ తొలి టెస్టుల్లో కచ్చితంగా ఆరుగురు బ్యాట్స్మెన్ తో ఆడాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో ధావన్ను చివరి రెండు టెస్టుల్లో తప్పిస్తే, 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలోనూ నాల్గో టెస్టులో వేటు వేశారు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా టూర్లోనూ తొలి టెస్టులో అవకాశం ఇచ్చి, చివరి రెండు టెస్టులకు బెంచ్కు పరిమితం చేశారు. ఓ అవకాశం ఇవ్వటం, వెంటనే వేటు వేయటం ధావన్ విషయంలో సర్వ సాధారణమైందని, అతడికి మరో అవకాశం ఎందుకివ్వరని గవాస్కర్ జట్టు మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా, పేసర్లకు సహకరిస్తున్న లార్డ్స్ పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దించాలనే ఆలోచన కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలదేనని వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేర్కొన్నాడు. ' కుల్దీప్ను ఆడించే విషయంలో నిర్ణయం కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రిలదే. అంతిమంగా కెప్టెన్దే తుది నిర్ణయం. కుల్దీప్ ఆడించేందుకు విరాట్ ప్రోద్బలం ఉందని నా నమ్మకం. పరిస్థితుల దృష్ట్యా ఇది పేసర్లకు సహకరిస్తున్నది నిజమే. కానీ కుల్దీప్ నాణ్యమైన స్పిన్నర్. తొలి టెస్టులో ఉమేశ్ మెరుగ్గా ఆడాడు. కానీ తుది జట్టు కూర్పుపై కెప్టెన్, కోచ్లదే తుది నిర్ణయం' అని అజింక్య మీడియాతో అన్నాడు.