Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వియత్నాం ఓపెన్
హో చి మిన్హ్ సిటీ : ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజరు జయరాంకు మరోమారు చుక్కెదురైంది. ట్రోఫీ లాంఛనమే అనుకున్న దశలో వరల్డ్ నం.79 చేతిలో అనూహ్య ఓటమి చెందిన జయరాం రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. జులైలో వైట్ నైట్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్లోనూ రన్నరప్గా నిలిచిన జయరాంకు తాజాగా వియత్నాం ఓపెన్లోనూ అదే ఫలితం ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో ఇండోనేషియా ఆటగాడు సెషర్ హిరెన్ గెలుపొందాడు. 28 నిమిషాల అంతిమ సమరంలో 14-21, 10-21తో జయరాం కనీస పోటీ సైతం ఇవ్వలేకపోయాడు. ఇండోనేషియా ఇంటర్నేషనల్ టైటిల్ను వరుసగా నాల్గోసారి నెగ్గిన హిరెన్ అదే ఊపులో వియత్నాం టైటిల్నూ ఎగరేసుకుపోయాడు.