Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు ముందు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ బీసీసీఐ సంధించబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని సమాచారం!. సఫారీ టూర్ వైఫల్యానికి బిజీ షెడ్యూల్, సరైన సన్నద్ధత లేదని చెప్పిన టీమ్ ఇండియా.. ఇప్పుడేం సమాధానం చెబుతుందని బోర్డు అధికారి ఒకరు అన్నారు. జట్టు కోరినట్టుగానే ముందుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ మ్యాచులు పెట్టాం, భారత్-ఎ జట్టును షాడో టూర్కు పంపించాం. విజరు, రహానెలకు ఎ జట్టుతో అవకాశం కల్పించాం. కోరిన అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు ఫలితం ఎందుకు రాలేదని బోర్డు ప్రశ్నిస్తుందని అతడు తెలిపాడు. మూడో టెస్టు తర్వాత చివరి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తి రేపుతోంది. గతంలో డంకన్ ఫ్లెచర్ కోచ్గా భారత్ 1-3తో ఇంగ్లాండ్కు సిరీస్ కోల్పోగా.. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే రవిశాస్త్రిని జట్టు డైరెక్టర్గా తీసుకొచ్చారు. ఇప్పుడూ అటువంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి!.