Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచ్ నాగపురి రమేశ్కు 'పి' కేటగిరి అక్రిడిటేషన్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు అధికారులు బిజి నెస్ తరగతుల్లో ప్రయాణించి, అథ్లెట్లను ఎకాన మీలో తీసుకెళ్లటంపై 2016 ఒలింపిక్స్ సంద ర్భంగా భారత్లో పెద్ద దుమారం చెలరేగింది. ఐనా, గత అనుభవాలను నుంచి భారత ఒలిం పిక్ సంఘం పాఠాలు నేర్వలేదు. అధికారులకు ఇచ్చిన ప్రాధాన్యం.. కోచ్లకు ఇవ్వటానికి మొండికేస్తోంది. అయితే, ఈ పరిణామం భారత ఒలింపిక్ సంఘంలో సాధారణం కావటం బాధాక రం!. 100 మీటర్ల పరుగు పందెంలో భారత్కు పసిడి తెచ్చేందుకు యువ స్ప్రింటర్ ద్యుతీ చంద్ ముందు వరుసలో ఉంది. హర్మోన్ల విషయంలో ఆసియా గేమ్స్ నిర్వాహకుల నిబంధనల మూలంగా 2014 ఇంచియాన్ క్రీడల్లో పాల్గొనలేని ద్యుతీ చంద్ ఇప్పుడు జకర్తాలో పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంది. కానీ క్రీడల సందర్భంగా ఆమె కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత నాగపురి రమేశ్కు ఐఓఏ సాధారణ అక్రిడిటేషన్ ఇవ్వటం వివాదస్పదమవుతోంది. దీంతో క్రీడల సమయంలో నాగపురి రమేశ్కు క్రీడా గ్రామంలో ఉండేందుకు వీలుం డదు. ఈవెంట్ సమయంలో మైదానంలో కాలుమోపే అవకాశం ఉండదు. పైగా, బయటి హోటల్లో సొంత ఖర్చులతో బస చేయాల్సి ఉంటుంది. మెడల్ రేసులో కీలక అథ్లెట్ విషయంలో భారత ఒలింపిక్ సంఘం వైఖరి చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ సన్నద్ధతలో ఎక్కడ చిన్న లోపం తలెత్తినా పతక ఆశలు గల్లంతవుతాయని నాగపురి రమేశ్ అన్నారు. దీనిపై ఒలింపిక్ సంఘం స్పందించాల్సి ఉంది.