Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ చాంప్ అభినవ్ బింద్రా
న్యూఢిల్లీ : పదేండ్ల క్రితం ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా.. తనకు తాను ' నిన్నటి విజేత'గా సంబోధించుకున్నాడు!. ఆసియా గేమ్స్ నేపథ్యంలో మాట్లాడిన బింద్రా.. దేశం నిన్నటి హీరోల గురించి మాట్లాడం మానేసి, నేటి విజేతలను తయారు చేయటంపై దృష్టి సారించాలని సూచిం చాడు. ' ఆటల్లో, గడిచిన రోజు ఎన్నటికీ లెక్కలోకి రాదు. నేను నిన్నటి మనిషిని, రేపటి ఒలింపిక్ చాంపియన్ కోసం ఎదురుచూస్తున్నాను' అని బింద్రా అన్నాడు. ఒలింపిక్స్లో తర్వాతి పసిడిని పట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి. క్రీడాకారుడి జీవితంలో వైఫల్యాలు ఉండాలి. విజయాన్ని సాధించేందుకు వాటిని అనువుగా మలుచుకోవాలని బింద్రా పేర్కొన్నాడు. జెఎస్డబ్ల్యూ ఇన్స్పైర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆవిష్కరణ సందర్భంగా బింద్రా మీడియతో మాట్లాడాడు.