Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్లో కనీస సన్నద్ధత లేకుండా బరిలోకి దిగటంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లిసేన.. లార్డ్స్ ఓటమి తర్వాత సైతం అదే ధోరణిలో ఉండటం ఆశ్చర్యకరం. లార్డ్స్ టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తున్నా కోహ్లిసేన నెట్స్లోకి అడుగుపెట్టలేదు. సోమవారం జిమ్ సెషన్కు హాజరైన ఆటగాళ్లు ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. మంగళవారం సైతం అదే జరిగింది. మూడో టెస్టు వేదిక నాటింగ్హామ్ (ట్రెంట్బ్రిడ్జ్)కు బుధవారం బయల్దేరిన టీమ్ ఇండియా.. గురువారమే నెట్స్లోకి వెళ్లనున్నది. మరో టెస్టుకు కేవలం రెండు రోజుల ప్రాక్టీస్తోనే భారత్ సిద్ధమవుతోంది. వారం రోజుల విరామం లభించినా కోహ్లిసేన సద్వినియోగం చేసుకోకపోవటంపై మాజీలు మళ్లీ ఏమంటారో?.
లండన్లో టీమ్ ఇండియా భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది హాజరయ్యారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా, కెప్టెన్ కోహ్లి అతడి పక్కనే ఉన్నాడు.