Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
గచ్చిబౌలిలో జరుగుతున్న ఏఐసీఎఫ్ ఇంటర్నేషననల్ ఉమెన్స్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. హోరాహోరిగా సాగిన ఈపోటీల్లో కజకిస్తాన్కు చెందిన నకబయేవా గులిస్ఖాన్ మొదటి బహుమతి (రూ.1.60లక్షలు) అందుకున్నది. రెండోబహుమతి మంగోలియాకు చెందిన మున్గున్తుల్ బత్హుయాగ్(రూ.1.30లక్షలు), తృతీయ బహుమతి ఉక్రేయిన్కు చెందిన బాబీ ఓలగ(రూ.లక్ష) గెెలుపొందింది. సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజరు బహుమతులను అందించారు.
గ్రాండ్ మాస్టర్ అర్జున్కు సన్మానం
14 ఏండ్ల వయస్సులోనే గ్రాండ్మాస్టర్గా ఎదిగిన తెలంగాణకు చెందిన యువ కెరటం ఇరిగేసి అర్జున్ను సాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్ ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయస్థాయిలో తెలంగాణ పేరును మార్మోగించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.