Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లార్డ్స్లో రెండో స్పిన్నర్పై రవిశాస్త్రి
- బ్యాట్స్మన్ క్రీజులో కఠినత్వం చూపాలి
- టీమ్ ఇండియా చీఫ్ కోచ్ శాస్త్రి
నాటింగ్హామ్ : లార్డ్స్లో ఘోర పరాజయం చవిచూసిన టీమ్ ఇండియా తీవ్ర విమర్శల పాలైంది. మైదానంలో ప్రదర్శన కలవర పాటుకు గురిచేస్తే, తుది జట్టు కూర్పు, వ్యూహం అంతకుమించిన తలనొప్పిగా పరిణమించాయి. ఇందుకు కారణంగా కెప్టెన్ కోహ్లితో పాటు చీఫ్ కోచ్ రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో దండ యాత్రే చేశారు!. లార్డ్స్ ఓటమి తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన రవిశాస్త్రి శనివారం ఆరంభమయ్యే మూడో టెస్టులో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు లార్డ్స్ తప్పిదాన్నీ అంగీకరించాడు. మూడో టెస్టు వేదిక నాటింగ్హామ్ (ట్రెంట్బ్రిడ్జ్)లో గురువారం ప్రాక్టీస్ సెషన్కు ముందు రవిశాస్త్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లా డాడు. ' తాజా పర్యటనలో మాకు కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇక్కడే క్రమశిక్షణ, స్వభావం ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాట్స్మన్ తన ఆఫ్ స్టంప్ ఎక్కడుందో తెలుసుకుని, వదిలేయాల్సిన బంతులపై మెరుగ్గా సిద్ధమవ్వాల్సి ఉంది. క్రీజులో కఠినంగా కనిపించేందుకు బ్యాట్స్మెన్ సిద్దం కావాలి' అని శాస్త్రి పేర్కొన్నాడు. తాజా పర్యటనలో అజింక్య రహానె ఫామ్పై స్పందిస్తూ.. ' ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించటం తగదని నా అభిప్రాయం. అజింక్య రహానె భారత టెస్టు జట్టు పిల్లర్లలో ఒకడు. ఇక ముందూ అతడి స్థానం అలాగే కొనసాగుతోంది. ఇరు వైపులా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. మానసికంగా దృడంగా కనిపించిన జట్టు పైచేయి సాధించింది. టెస్టు మ్యాచ్ సాగుతున్న కొద్ది మానసిక స్థితి బ్యాట్స్మన్కు అత్యంత కీలకం. విరాట్ కోహ్లి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. నెట్స్లోనూ కోహ్లి మెరుగ్గా కనిపిస్తున్నాడు. శనివారం మ్యాచ్ సమయానికి అతడిని పూర్తి ఫిట్నెస్ సాధించగలడు' అని రవిశాస్త్రి అన్నాడు.
ఇక లార్డ్స్లో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి చెందటం పట్ల శాస్త్రి స్పందించాడు. ' లార్డ్స్లో రెండో స్పిన్నర్ను ఎంచుకోవటం పెద్ద పొరపాటు. అప్పటి పరిస్థితుల ఆధారంగా మరో పేసర్తో వెళ్లాల్సింది. ఇదే సమయంలో తర్వాతి రోజుల్లో వర్షం తీవ్రత ఎలా ఉంటుందో అనేది చెప్పలేని పరిస్థితి. వాతావరణం సాధారణంగా ఉండి, ఆట ఐదో రోజుకు వరకూ వెళితే అప్పుడు రెండో స్పిన్నర్ అవసరం ఏర్పడేది. కానీ మేం అనుకున్నది జరుగలేదు. వర్షం కీలక పాత్ర పోషించింది. మేం ఓడిపోయాం, ఆ పరిస్థితుల్లో మరో పేసర్ను ఆడించటం మంచి నిర్ణయం అయి ఉండేది' అని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ టీమ్ మేనేజర్, ప్రఖాత్య కోచ్ అజిత్ వాడేకర్ మృతి పట్ల భారత జట్టు సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా వాడేకర్తో జ్ఞాపకాలను శాస్త్రి గుర్తుచేశారు.
కోహ్లిసేన ప్రాక్టీస్.. ప్రాక్టీస్
ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు కోసం బుధవారం నాటింగ్హామ్ చేరుకున్న కోహ్లిసేన.. గురువారం మైదా నంలోకి అడుగుపెట్టింది. లార్డ్స్ టెస్టు తర్వాత తొలిసారి నెట్స్లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియా శనివారం ఆరంభమయ్యే టెస్టు కోసం తీవ్రంగా చెమటోడ్చింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం ప్రాక్టీస్కు హాజరయ్యాడు. స్టార్ సీమర్ జశ్ప్రీత్ బుమ్రా నెట్స్లో పూర్తి ఉత్సాహంతో బంతులేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్ ఆరంభానికి ముందు చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశాడు!.