Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ జట్టుకు మార్గదర్శి
దుబాయ్ : ఆసియా కప్లో సూపర్ స్టార్ విరాట్ కోహ్లి లేకుండానే బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని పెద్ద దిక్కుగా మారాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ధోని మెరుగైన ప్రదర్శన చేయకపోయినా, తాజా ఆసియా కప్లో మహిపై మంచి అంచనాలున్నాయి. టీమ్ మేనేజ్మెంట్ సైతం ధోనిని ఇప్పటికీ మ్యాచ్ విన్నర్గానే చూస్తోంది. వీటన్నింటికి తోడు మైదానంలో వ్యూహత్మకంగా ధోని సూచనలు తాత్కాలిక కెప్టెన్కు రోహిత్ శర్మకు అత్యంత విలువైనవి. క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లకు మహి ఇచ్చే సలహాలు సైతం మ్యాచ్ను మలుపుతిప్పగలవు. అందుకే కోహ్లి లేని ఆసియా కప్లో మహి మరోమారు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఆటగాళ్లు మూడు రోజుల విశ్రాంతి తర్వాత దుబారుకు చేరుకోగా, సహాయక సిబ్బంది ఈ ఆదివారం జట్టుతో చేరనున్నారు. కానీ అంతకుముందే టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అంబటి రాయుడు సహా ఎం.ఎస్ ధోనిలు నెట్స్లో చెమటోడ్చుతున్నారు. వీరికి నెట్ బౌలర్లుగా భారత-ఏ జట్టు సీమర్లు, స్పిన్నర్లను పంపిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్లోనే పొరుగు దేశం పాకిస్థాన్తో తలపడనున్న భారత్ను ఒత్తిడి నుంచి మ్యాచ్ పరిస్థితుల్లో నిలుపగల సమర్థత ధోని సొంతం. దీంతో ఆసియా కప్లో ఎం.ఎస్ ధోని బ్యాట్స్మన్, వికెట్కీపర్గానే కాకుండా సీనియర్ ఆటగాడిగా జట్టును నడిపించే గురుతర బాధ్యత తీసుకోనున్నాడు!.