Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత బాక్సర్లు మూడు పసిడి పతకాలు సాధించారు. ఇస్తాంబుల్లో జరిగిన అహ్మత్ కొమర్ట్ టోర్నీలో మన అమ్మాయిలు పసిడి పంచ్లు విసిరారు. 64 కేజీల విభాగంలో సిమ్రాన్ జిత్ కౌర్ బంగారు పతకం గెలువగా, టర్కీ బాక్సర్పై నెగ్గి మోనిక పసిడి సాధించింది. మరో ఫైనల్లో భాగ్యబతి సైతం విజేతగా నిలిచింది. 51 కేజీల విభాగంలో పోటీపడిన పింకీ జాంగ్ర రజతంతో సరిపెట్టుకున్నది. ఫైనల్లో టర్కీ బాక్సర్ చేతిలో పోరాడి ఓడిన పింకీ రెండో స్థానంలో నిలిచింది. భారత బాక్సర్ భాగ్యబతి టోర్నీ ' మోస్ట్ సైంటిఫిక్ 'బాక్సర్ అవార్డు అందుకున్నది.