Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్పై కన్నేసిన సింధు, సైనా
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ : ఈ సీజన్లో రెండు మెగా ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ సాధించి జోరుమీదున్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి సింధు చైనా ఓపెన్పై కన్నేసింది. ప్రతిష్టాత్మక చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నేటి నుంచి ఆరంభం కానున్నది. గతంలో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ సహా పి.వి సింధు సైతం ఇక్కడ విజేతగా నిలిచింది. ఈ ముగ్గురూ ఈసారీ బరిలోకి నిలిచారు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్ పి.వి సింధు తొలి రౌండ్లో సులువైన ప్రత్యర్థిని ఎదుర్కొనున్నది. అర్హత రౌండ్లో నెగ్గిన జపాన్ అమ్మాయితో సింధు నేడు పోటీపడనున్నది. సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లోనే కఠినమైన ప్రత్యర్థి ఎదురైంది. కొరియా షట్లర్ సంగ్ జీ హ్యూన్తో సైనా పోరాడనున్నది. తొలి రౌండ్లలో సింధు, సైనాలు నెగ్గితే క్వార్టర్ఫైనల్లో ముఖాముఖికి అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ మరోసారి టైటిల్పై కన్నేశాడు. ఆసియా క్రీడల్లో ఆరంభంలోనే వెనుదిరిగిన శ్రీకాంత్ ఇక్కడ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. డెన్మార్ ఆటగాడు రాస్మస్తో కిదాంబి తొలి రౌండ్లో ఆడనున్నాడు. మరో షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుకి తొలి రౌండ్లో హాంగ్కాంగ్ షట్లర్ సవాల్ విసరనున్నాడు.