Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత్, పాకిస్థాన్లు దుబారులో ఓ వైపు క్రికెట్ సమరానికి సిద్ధమవుతుండగా, మరో వైపు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు న్యాయస్థానంలో పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక క్రికెట్ ఆడకపోవటంతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లిందని ఐసీసీ వద్ద పీసీబీ లీగల్ పిటిషను దాఖలు చేసింది. భారీ నష్ట పరిహారం కోరుతూ, బీసీసీఐపై పోరాడేందుకు ఇదివరకే ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ న్యాయవాదిని నియమించుకున్నది. అక్టోబర్ 1-3న దుబారులో ఈ కేసు విచారణను రానున్నది. దీంతో బీసీసీఐ సైతం లండన్కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ న్యాయవాది ఇయాన్ మిల్స్ సేవలు వినియోగించుకోనున్నది. సీఈవో రాహుల్ జోహ్రీ, కార్యదర్శి అమితాబ్ చౌదరిలు ఇప్పటికేతో మిల్స్తో ఈ అంశంపై కీలక భేటీలు జరిపినట్టు తెలుస్తోంది.