Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్ణయం
న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ను గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ది పరిచేందుకు బ్యాడ్మింటన్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (బారు) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘాలకు రూ. 1.6 కోట్లు అందించాలని సోమవారం న్యూఢిల్లీలో జరిగిన బారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 32 రాష్ట్ర సంఘాలకు రూ. 5 లక్షల చొప్పున బారు నిదులు అందనున్నాయి. రాష్ట్ర సంఘాలకు ఆర్థిక సహాయంతో క్షేత్ర స్థాయి నుంచి బ్యాడ్మింటన్ అభివృద్ది చేయాలనే బారు సంకల్పానికి ఆరంభమని బారు అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. నాలుగు ప్రాంతీయ అకాడమీలు, ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాలు బ్యాడ్మింటన్లో గొప్ప మార్పులు తీసుకొస్తున్నాయని కార్యదర్శి అజరు సింఘానియా అన్నారు.