Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన పూనమ్, రొడ్రిగస్
- శ్రీలంకతో తొలి టీ20
కతునాయకె (శ్రీలంక) : ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం. యువ క్రికెటర్లు రాణించటంతో శ్రీలంకతో తొలి టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 168/8 పరుగులు చేసింది. వికెట్ కీపర్ తానియా భాటియా (46, 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), యువ బ్యాట్స్వుమెన్ జెమీమా రొడ్రిగస్ (36, 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగారు. జెమీమా మూడేసి ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కింది. ఆఖర్లో అనుజా పాటిల్ (36) సైతం ధాటిగా పరుగులు పిండుకున్నది. వేద కృష్ణమూర్తి (21) ఫర్వాలేదనిపించింది. పూనమ్ యాదవ్ (4/26) బంతితో నిప్పులు చెరగటంతో ఛేదనలో శ్రీలంక కుదే లైంది. కౌశల్య (45), యశోద (32)లు రాణించినా శ్రీలంక 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ ఇండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. బ్యా ట్తో 2 పరుగులు చేసిన అరుంధతి ఓ వికెట్ తీసుకుని ఆకట్టుకునే ప్రదర్శన గావించింది.