Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్రామీణ క్రీడ కబడ్డీలో మరో పోటీ ప్రొ లీగ్ వచ్చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా ఏర్పడిన ది న్యూ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్త లీగ్ను తీసుకొస్తుంది. ఈ మేరకు ఏకేఎఫ్ఐ బుధవారం ప్రకటించింది. 1000 మంది క్రీడాకారులతో కూడిన ఈ లీగ్ 2019 జనవరి 26 నుంచి ఆరంభం కానున్నది,. 823 మంది దేశవాళీ ప్లేయర్లు, 137 మంది జాతీ, అంతర్జాతీయ క్రీడాకారులతో ఇండో ఇంటర్నేషనల్ ప్రీమియర్ కబడ్డీ లీగ్ను నిర్వహించనున్నారు. ఆటగాళ్ల వేలం జనవరి 5న నిర్వహించనుండగా, దేవశాళీ ఆటగాళ్ల ఎంపిక కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారు. లీగ్లో బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, తెలంగాణ, పట్నా, హర్యానా, ముంబయి, కోల్కత జట్లతో ప్రాంఛైజీలు ఉండనున్నాయి. న్యూజిలాండ్, పోలాండ్, టాంజానియా, ఆస్ట్రేలియా, నార్వే, బ్రిటన్, కెనడా, యుఎస్ఏ, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మెక్సికో, మారిషస్, కెన్యా, ఇరాక్, డెన్మార్క్ల నుంచి క్రీడాకారులు పాల్గొనున్నారని ఏకేఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాద్ వెల్లడించారు. లీగ్ ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం వాటాను ఆటగాళ్లను పంచుతామని నిర్వాహకులు పేర్కొన్నారు.