Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్ కోహ్లి, లోకల్ బాయ్ జడేజా శతకాలు
- 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన విండీస్
- భారత్ ప్రస్తుతం ఆధిక్యం 555 పరుగులు
ఎండ వేడితో ఉక్కిరిబిక్కరయ్యే రాజ్కోట్లో కోహ్లిసేన వేడి వేడి ప్రదర్శనతో కరీబియన్లు కందిపోయారు!. కెప్టెన్ కోహ్లి కెరీర్లో 24వ శతకానికి అందుకోగా, లోకల్ బారు రవీంద్ర జడేజా టెస్టుల్లో తొలి సెంచరీ రుచి చూశాడు. యంగ్ వండర్ రిషబ్ పంత్ విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగాడు. కోహ్లి (139), జడేజా (100), రిషబ్ పంత్ (92) మెరుపులతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 649/9 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లరేషన్ ప్రకటించింది.
భారత బ్యాట్స్మన్ జోరుతో ఫ్లాట్గా కనిపించిన రాజ్కోట్ పిచ్, నిమిషాల వ్యవధిలో బౌలర్ల దెబ్బకు స్పిన్ పిచ్ అయిపోయింది!. మహ్మద్ షమి (2/11)కు తోడు అశ్విన్, జడేజా, కుల్దీప్ మాయ చేయటంతో విండీస్ 94/6తో దారుణ పరాభవం ముంగిట నిలిచింది. ప్రస్తుతం 555 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న కోహ్లిసేన.. కరీబియన్లు అద్భుతంగా పోరాడినా
మరోసారి బ్యాట్ పట్టే అవకాశం లేనట్టే!. ఇక ఆసక్తి అంతా మ్యాచ్ను మనోళ్లు నేడే ముగిస్తారా? లేదా అని!.
రాజ్కోట్
పృథ్వీ షా శతక షోతో తొలి రోజే చితికిపోయిన విండీస్ను రెండో రోజు కోహ్లి, జడేజా, పంత్ త్రయం చితక్కొట్టింది. ఈ ముగ్గురులో ఇద్దరు సెంచరీలతో కదంతొక్కగా తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (139, 230 బంతుల్లో 10 ఫోర్లు) 24వ టెస్టు సెంచరీ సాధించగా, రాజ్కోట్ హీరో రవీంద్ర జడేజా (100 నాటౌట్, 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు) కెరీర్ తొలి శతకంతో అదరగొట్టాడు. ఓవర్నైట్ స్కోరు 17తో బరిలోకి రిషబ్ పంత్ (92, 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి సెషన్లో విండీస్పై విరుచుకుపడిన పంత్.. వేగవంతమైన సెంచరీ దిశగా సాగాడు. కానీ ఆ మార్క్కు మరో 8 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. జడేజా శతక పూర్తవ్వగానే కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేశాడు. ఆఖరి సెషన్లో బ్యాట్ పట్టిన కరీబియన్లకు కంటి నిద్ర లేకుండా చేశారు బౌలర్లు. 29 ఓవర్లలోనే బ్యాట్స్మెన్ను మూటగట్టి పెవిలియన్కు పంపి 555 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిపారు. భారత పేసర్లు, స్పిన్నర్ల జోరు ముందు నేడు 90 ఓవర్ల పాటు విండీస్ 13 వికెట్లు కాచుకోవటం అసాధ్యమే అనిపిస్తోంది!.
షమి, స్పిన్ అదరింది : భారత బ్యాట్స్మెన్ దెబ్బకు భారీ స్కోరు ఇచ్చుకున్న విండీస్కు.. బ్యాట్తో కాసింతైనా సంతోషం ఇవ్వలేదు మన బౌలర్లు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలెట్టారు. 29 ఓవర్ల వరకూ ఎక్కడా వికెట్ల యాత్రకు విరామం పడలేదు. కెరీర్ 50 టెస్టు ఆడుత్ను క్రెగ్ బ్రాత్వైట్ (2), పావెల్ (1)లను వరుస ఓవర్లలో బలిగొన్న మహ్మద్ షమి విండీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆఫ్స్పిన్నర్ అశ్విన్ మూడో వికెట్గా హౌప్ (10)ను అవుట్ చేయగా.. మైదానంలో చిరుత పులిలా కదిలిన రవీంద్ర జడేజా చాకచక్యంతో హెట్మియర్ (10)ను రనౌట్ చేశాడు. ఫామ్లో ఉన్న సునీల్ అంబ్రిస్ (12)ను జడేజా బంతితో బలిగొనగా..49 పరుగులకే విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో పడింది. డావ్రిచ్ (10)ను చైనామన్ కుల్దీప్ అవుట్ చేసి కరీబియన్ల కష్టాలను మరింత పెంచాడు. రెండో రోజు మరిన్ని వికెట్లు పడకుండా ఛేజ్ (27), పాల్ (13)లు నాలుగు వికెట్ల పాటు కాచుకున్నారు.
కోహ్లి, జడేజా, పంత్ వీరంగం : రెండో రోజు బ్యాట్స్మన్ జోరు కొనసాగింది. యువ ఆటగాడు రిషబ్ పంత్ (92, 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) విండీస్పై విరుచుకుపడ్డాడు. 57 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన పంత్.. ఓ దశలో కోహ్లి కంటే ముందుగానే శతకం సాధించేలా కనిపించాడు. సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన కోహ్లి.. 184 బంతుల్లో కెరీర్ 24వ సెంచరీని అందుకున్నాడు. బౌండరీల వర్షంతో శతకం వైపు దూసుకొచ్చిన పంత్కు బిషు బ్రేక్ వేశాడు. సెంచరీ సంబురం లేకుండా చేశాడు. పంత్ నిష్క్రమణతో కెప్టెన్ కోహ్లికి తోడైన రవీంద్ర జడేజా (100) సొంతమైదానంలో శతకానందాన్ని పొందాడు. 87 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన జడ్డూ, సెంచరీని ఐదేసి ఫోర్లు, సిక్సర్లతో 134 బంతుల్లోనే సాధించాడు. డబుల్ సెంచరీని ఊరించిన కోహ్లి సులభంగానే వికెట్ ఇచ్చుకోగా, లోయర్ ఆర్డర్ వేగంగా వికెట్లు కోల్పోయింది. జడేజా సెంచరీ పూర్తవ్వగానే కోహ్లి డిక్లరేషన్ ప్రకటించాడు. అశ్విన్ (7), కుల్దీప్ (12), ఉమేశ్ యాదవ్ (22)లు ఆఖర్లో జడేజాకు సహకరించారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ బిషు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అరంగేట్ర పేసర్ కోహ్లి వికెట్తో సంతృప్తి పడ్డాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి,బి) బిషు 134, కెఎల్ రాహుల్ (ఎల్బీ) గాబ్రియల్ 0, చతేశ్వర్ పుజారా (సి) డావ్రిచ్ (బి) లెవిస్ 86, విరాట్ కోహ్లి (సి) బిషు (బి) లెవిస్, అజింక్య రహానె (సి) డావ్రిచ్ (బి) ఛేజ్ 41, రిషబ్ పంత్ (సి) పాల్ (బి) బిషు 92, రవీంద్ర జడేజా నాటౌట్ 100, అశ్విన్ (సి) డావ్రిచ్ (బి) బిషు 7, కుల్దీప్ యాదవ్ (ఎల్బీ) బిషు 12, ఉమేశ్ యాదవ్ (సి) లెవిస్ (బి) బ్రాత్వైట్ 22, మహ్మద్ షమి నాటౌట్ 2, ఎక్స్ట్రాలు : 14, మొత్తం :( 149.5 ఓవర్లలో 9 వికెట్లకు) 649 డిక్లేర్డ్.
వికెట్ల పతనం : 1-3, 2-209, 3-232, 4-337, 5-470, 6-534, 7-545, 8-571, 9-626.
బౌలింగ్ : గాబ్రియల్ 21-1-84-1, పాల్ 15-1-61-0, లెవిస్ 20-0-93-2, బిషు 54-3-217-4, ఛేజ్ 26-1-137-1, బ్రాత్వైట్ 13.5-1-47-1.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : క్రెగ్ బ్రాత్వైట్ (బి) మహ్మద్ షమి 2, పాల్ (ఎల్బీ) మహ్మద్ షమి 1, షాV్ా హౌప్ (బి) అశ్విన్ 10, హెట్మియర్ రనౌట్ (జడేజా) 10, సునీల్ అంబ్రిస్ (సి) రహానె (బి) జడేజా 12, ఛేజ్ బ్యాటింగ్ 27, డావ్రిచ్ (బి) కుల్దీప్ యాదవ్ 10, పాల్ బ్యాటింగ్ 13, ఎక్స్ట్రాలు : 09, మొత్తం : (29 ఓవర్లలో 6 వికెట్లకు) 94.
వికెట్ల పతనం : 1-2, 2-7, 3-21, 4-32, 5-49, 6-74.
బౌలింగ్ : మహ్మద్ షమి 6-2-11-2, ఉమేశ్ యాదవ్ 7-1-14-0, అశ్విన్ 7-0-32-1, జడేజా 5-1-9-1, కుల్దీప్ యాదవ్ 4-1-19-1.
రంజీ నాకౌట్కు చేరగలరా?
ప్రపంచ క్రికెట్ను శాసించి, ప్రత్యర్థులను వణికించిన స్వర్ణ చరిత్ర విండీస్ క్రికెట్ సొంతం. ప్రపంచ క్రికెట్లో విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు, వెన్నులో వణుకు పుట్టించిన వేగవంతమైన బంతులు విండీస్ నుంచే దూసుకొచ్చాయి. అన్ని విభాగాల్లో ఎదురులేని ప్రదర్శనతో క్రికెట్ను ఏలిన ఘన చరిత్ర వారిది. కానీ కాలంతో పాటు కరీబియన్ల క్రికెట్ ఘనత కనుమరుగై పోతోంది!. స్టార్ ఆటగాళ్లు టెస్టులకు దూరంగా ఉండటానికి తోడు, నాణ్యమై క్రికెటర్లు బోర్డుతో వివాదంతో లీగ్ల్లో ఆడుతున్నారు. ఐదు రోజుల ఆటలో నాణ్యమైన ఆటగాళ్లే విండీస్కు కరువయ్యారు. ఫలితమే నేడు రాజ్కోట్లో కరీబియన్ల దయనీయ ప్రదర్శన. విండీస్ క్రికెట్ను ప్రేమించిన అభిమానులు, క్రికెటర్లకు కరీబియన్ల ప్రదర్శన ఆవేదన మిగిల్చుతోంది. రాజ్కోట్ టెస్టు బలవంతుడికి, బలహీనుడికి మధ్య పోటీగా మారింది. భారత్-ఎ జట్టుతో పోటీపడగల సత్తా కూడా లేని విండీస్ రాజ్కోట్లో కోహ్లిసేనను ఢకొీడుతుంది. ఫలితం అందరూ చూస్తూనే ఉన్నాం. ఈ వెస్టిండీస్ మన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో ఆడి కనీసం నాకౌట్కు చేరగలదా? అని టర్బోనేటర్ హర్బజన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. 'వెస్టిండీస్ క్రికెట్ అంతే ఎంతో గౌరవం ఉంది. కానీ మీకందరికీ నాదో ప్రశ్న. ప్లేట్ గ్రూప్ నుంచి ఈ విండీస్ జట్టు రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించగలదా? ఎలైట్ గ్రూప్ నుంచి ఎలాగూ అర్హత సాధించలేదు' అని భజ్జీ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. రాజ్కోట్ టెస్టు 'అసమానుల మధ్య సమరం'గా క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లె అభిప్రాయపడ్డాడు.
అంకెల్లో..
వేగవంతంగా 24 టెస్టు శతకాలు సాధించి భారత క్రికెటర్ విరాట్ కోహ్లి. సచిన్ టెండూల్కర్ (125), సునీల్ గవాస్కర్ (127)లను కోహ్లి (123) అధిగమించాడు. ఓవరాల్గా బ్రాడ్మన్ (66) మాత్రమే కోహ్లి కంటే ముం దున్నాడు.
రవీంద్ర జడేజాకు రాజ్కోట్ శతకమే టెస్టుల్లో తొలి సెంచరీ. సొంతగడ్డపై జడ్డూ 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.