Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సంఘాలకు మరిన్ని టికెట్లు
ముంబయి : రాష్ట్ర క్రికెట్ సంఘాలతో ఉచిత టిక్కెట్ల విషయంలో విమ ర్శలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ విషయంలో ఉపశమనం ఇచ్చే నిర్ణయం తీసుకున్నది. ఆతిథ్య మ్యాచ్కు తనకు వచ్చే వాటా 1200 టికెట్లలో 600 టికెట్లను బీసీసీఐ స్వచ్ఛందంగా వదులుకున్నది. ఇక నుంచి ప్రతి మ్యాచ్కు బీసీసీఐ 604 టిక్కెట్లు మాత్రమే తీసుకోనున్నది. ఆతిథ్య రాష్ట్ర క్రికెట్ సంఘానికి మిగతా 600 టిక్కెట్లను వదులుకున్నది. టిక్కెట్ల విషయంలో వివాదంతోనే అక్టోబర్ 24న ఇండోర్లో జరగాల్సిన వన్డేను మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం వదులుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు, కోల్కతలు సైతం బోర్డును ఈ విషయంలో హెచ్చరించారు. దీంతో పాలకుల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 12న హైదరాబాద్లో జరగాల్సిన రెండో టెస్టు నుంచే ఇది అమల్లోకి రానున్నది.