Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పీబీఎల్ షట్లర్ల వేలం
ముంబయి : ఓ వైపు కబడ్డీ కూత మొదలవగా, మరోవైపు షటిల్ వేలానికి వేళైంది!. 2018 ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఆటగాళ్ల వేలం నేడు ముంబయిలో జరుగుతుంది. గత సీజన్లో పాల్గొన్న 8 జట్లకు తోడు సినీ నటి తాప్సి కొనుగోలు చేసిన పుణె ప్రాంఛైజీ తొలిసారి వేలంలో పాల్గొనబోతుంది. వేలంలో సుమారు 85 మంది దేశీయ, అంతర్జాతీయ షటిల్ స్టార్స్ అందుబాటులో ఉన్నారు. ప్రతి ప్రాంఛైజీ వేలంలో రూ. 2.5 కోట్లు ఖర్చు చేయనున్నది. సైనా నెహ్వాల్, పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సిక్కి రెడ్డి, సాత్విక్సాయి రాంకీరెడ్డి, సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరులు ఈ సారి వేలంలో హాట్గా మారనున్నారు!. వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్, కొరియా స్టార్ సన్ వా హౌ, స్పెయిన్ సుందరి కరొలినా మారిన్లు విదేశీ ప్లేయర్స్ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత సీజన్ వేలంలో హెచ్.ఎస్ ప్రణరు అత్యధిక మొత్తం దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. పీబీఎల్ వేలంలో ఇప్పటివరకూ కోటి కూత కూయలేదు. ఈ సారి ఆ రికార్డును అందుకుంటారేమో ఆసక్తికరం. డిసెంబర్ 22 నుంచి జనవరి 13 (2019) వరకు పీబీఎల్ సీజన్ జరగాల్సి ఉంది. ఆరంభ మ్యాచ్ సైతం ముంబయిలోనే జరుగుతుంది.