Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : సూపర్స్టార్ విరాట్ కోహ్లి, యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రాలు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాట్తో కోహ్లి, బంతితో బుమ్రా ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రపథంలో నిలువగా.. వన్డే ఫార్మాట్లో భారత్ ఆధిపత్యం చాటుకున్నది. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లి 884 పాయింట్లతో వరల్డ్ నం.1గా కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 842 పాయింట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ టాప్-10లో చోటు నిలుపుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జశ్ప్రీత్ బుమ్రా 797 పాయింట్లతో నం.1గా నిలువగా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయతో తృతీయ స్థానంలో నిలిచాడు. యుజ్వెంద్ర చాహల్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. జట్టు ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా వరల్డ్ నం.2గా కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు భారత్ కంటే ఐదు పాయింట్ల మెరుగుదలతో అగ్రస్థానంలో ఉంది.