Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనా ఈశాన్య ప్రాంఛైజీ సొంతం
- కొత్త జట్టు పుణెకు మారిన్
- బ్యాడ్మింటన్ లీగ్ ప్లేయర్స్ వేలం
న్యూఢిల్లీ : 26 దేశాలు. 145 మంది ఆటగాళ్లు. అట్టిపెట్టుకునే అవకాశం లేదు. రిటెన్షన్ కార్డు అసలే లేదు. దీంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ప్లేయర్స్ వేలం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దిగ్గజ షట్లర్ల కోసం అన్ని ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. సుమారుగా దిగ్గజ షట్లర్లు అందరూ వేలంలో రూ. 80 లక్షల ధర అందుకున్నారు. స్టార్ షట్లర్ పి.వి సింధు తొలిసారి హైదరాబాద్ హంటర్స్కు ఆడనున్నది. తొలి సారి వేలంలో సైనా నెహ్వాల్పై ఎవ్వరూ ఆసక్తి చూపకపోవటం ఆశ్చర్యకర పరిణామం. కానీ రెండో రౌండ్లో నార్త్ఈస్టర్న్ వారియర్స్ దిగ్గజ క్రీడాకారిణికి దక్కించుకున్నది. కరొలినా మారిన్ను కొత్త ప్రాంఛైజీ పుణె 7ఏసెస్ సొంతం చేసుకున్నది. కిదాంబి శ్రీకాంత్ బెంగళూర్కు, విక్టర్ అక్సెల్సన్ అహ్మదాబాద్కు, హెచ్.ఎస్ ప్రణరు ఢిల్లీకి ఆడనున్నారు. వీరంతా వేలంలో రూ. 80 లక్షలు దక్కించుకున్నారు. ఇండోనేషియా షట్లర్ టామీ సుగారిటో కోసం ఢిల్లీ రూ. 70 లక్షలు వెచ్చించగా, డబుల్స్ స్టార్ సాత్విక్సాయి కోసం అహ్మదాబాద్ రూ. 52 లక్షలు కుమ్మరించింది. పీబీఎల్ డిసెంబర్ 22న ముంబయిలో ఆరంభం కానున్నది.