Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జావెలిన్ త్రో లో పసిడి
- ఆసియా పారా క్రీడలు
జకర్తా : ఆసియా పారా క్రీడల్లో భారత పతకాల వేట స్వర్ణంతో మొదలైంది. జకర్తా ఆసియా క్రీడల్లో యువ సంచలనం నీరజ్ చోప్రా వరల్డ్ రికార్డుతో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పారా క్రీడల్లోనూ జావెలిన్ త్రో పసిడి మన సొంతమైంది. జావెలిన్ త్రోయర్ సందీప్ చౌదరి 60.01 మీటర్లతో పసడి పతకం సాధించాడు. పురుషుల ఎఫ్42-44/61-44 విభాగంలో పోటీపడిన సందీప్ చౌదరి మూడో ప్రయత్నంలో పసిడి పతక దూరం జావెలిన్ను విసిరాడు. శ్రీలంక పారా అథ్లెట్ సంపత్ హెతి 59.32 మీటర్ల దూరంలో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఇరాన్ పారా అథ్లెట్ ఒమిది అలీ 58.97 మీటర్ల దూరంతో కాంస్య పతకం కొల్లగొట్టాడు.