Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనీ..రిషబ్. వీరిద్దరికా..?
ముంబయి: వెస్టీండీస్తో జరుగుతున్న మ్యాచ్లలో ఎవరు ఆడుతారన్న దానిపై క్రీడాభిమానుల్లో చర్చ. 21 నుంచి ప్రారంభం కానున్న మ్యాచుల్లో ఐదు వన్డేలు, మూడు టీ..20 మ్యాచులున్నాయి.మాజీ కెప్టెన్,వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఫామ్లోలేకపోవటంతో..వెస్టీండీస్తో భారత్ ఆడే వన్డే మ్యాచుల్లో రిషబ్ పంత్కు చోటు దక్కే అవకాశాలున్నాయని అంచనా. గురువారం హైదరాబాద్ జరిగే సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటిదాకా మూడు మ్యాచుల్లో ఆడే ప్లేయర్లను ఎంపిక చేయాలా..లేక మొత్తం సీరీస్ కోసం తీసుకోవాలా అన్న దానిపై తుదినిర్ణయం తీసుకోలేదు. ఈలోపు వన్డే సీరీస్ 21 నుంచి షురూ కానున్నది.ఇక కెప్టెన్ విరాట్ కోహ్లిను ఆడించటం గురించి కూడా కీలకమైన అంశంగా బోర్డు పరిగణిస్తున్నది.ఇక ధోనీ కీపింగ్ బాగున్నా...అవసరమైన విధంగా ఫామ్లో లేడన్న చర్చకూడా ఉన్నది.ధోనీ విశ్వకప్ దాకా ఆడతాడని బోర్డులోని ఓ అధికారి తెలిపారు. ఇక పిషబ్ విషయంలో అతనికి నిరాశ కల్పించమని కూడా చెప్పారు. ఓవల్లో తొలి టెస్టు మ్యాచ్లో శతకం బాదిన రిషబ్ రాజ్కోట్లోనూ 92 పరుగులు చేశాడు. 20 ఏండ్లలో వికెట్ కీపర్,బ్యాటింగ్తో అదరగొడుతున్న అతడ్ని టీమ్లో తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతున్నది. దినేశ్ కార్తీక్ టీమ్లో ఉన్నా..ఆశించినరీతిలో రాణించలేకపోతున్నాడు. ఇలా పలువురి ఆటతీరును పరిగణనలోకి తీసుకున్నాకే..బోర్డు తుది జట్టును ప్రకటించటానికి కసరత్తు చేస్తున్నది.