Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వేల మందికి ఉచిత ప్రవేశం
హైదరాబాద్: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్కు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే మ్యాచ్కు 20 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతిరోజూ 4000 మంది విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్తో ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని ఎన్సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాండురంగమూర్తి తెలిపారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు క్రికెట్పై మక్కువ కల్పించాలని, ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. పాస్లు పొంది ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే విద్యార్థులు మ్యాచ్లు తిలకించటానికి రావాల్సి ఉంటుందన్నారు.