Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోహౌర్ కప్లో ఆస్ట్రేలియాపై విజయం
జోహౌర్బరు(మలేషియా): భారతీయ హాకీ జూనియర్ టీమ్ విజయాలబాటలో పయనిస్తున్నది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5..4 గోల్స్ తేడాతో ఓడించి..భారత్ నాలుగోవిజయాన్ని నమోదుచేసుకున్నది. దీంతో పూల్లో వరుసగా సత్తా చాటుతూ అగ్రభాగన నిలిచింది.ఆస్ట్రేలియా,భారత్ జట్లు పోటీపడి ఆడటంతో..ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఆట ప్రారంభంలో పెనాల్టీ కార్నర్ దొరికినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.అయితే ఐదో నిమిషంలో గురుసాహిబ్జిత్ అద్భుతంగా ఆడి గోల్ చేశాడు. దాంతో భారత్కు 1..0 ఆధిక్యం దక్కింది. అదే జోష్తో ఆటను కొసాగించిన భారత్ హాకీ ఆటగాళ్లు వరుసగా..11,14,15 వ నిమిషాల్లో గోల్స్ చేశారు. దీంతో భారత్ స్కోర్ 4..0కి చేరింది. క్రమారశ్,హర్ప్రీత్సింగ్,మన్దీప్ మోర్,విష్ణుకాంత్ సింగ్లు ఈ గోల్స్ను సాధించారు. తొలి క్వార్టర్లో నాలుగుగోల్స్ కోల్పోయ్యాక ఆస్ట్రేలియా..ఆట చివర్లో విజృంభించింది. రెండో క్వార్టర్లో భారత్ రక్షయవలయాన్ని ఛేదించుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గోల్స్వైపు దూకూడు పెంచారు.18 వనిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు పెనాల్టీ స్ట్రోక్తో గోల్చేశాడు. డైమన్ స్ఫీఓన్స్ మళ్లీ 35 వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకోవటంతో..రెండోగోల్ చేశాడు. వెనువెంటనే మూడో గోల్ను కొట్టారు.శైలేంద్ర లాకడా 43 వ నిమిషంలో గోల్ కొట్టడంతో 5..3 స్కోరుకు చేరింది. అయితే చివర్లో గోల్ను కాపాడుకునే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు భారత ఆటగాళ్లు. 59 వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ స్ట్రోక్ను జారవిడుచుకున్నారు. అయితే అందివచ్చిన మరోగోల్ఛాన్స్ను మాత్రం స్టీఫెన్ సాధించటంతో సఫలమయ్యాడు.