Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పృథ్వీ షా ఖాతాలో మరో రికార్డు ?
- ఆ ముగ్గురి సరసన నిలబడతాడా..!
న్యూఢిల్లీ:తొలి ఆటలోనే అద్భుతంగా రాణిస్తే..ఆ ఆటగాడివైపే అందరికండ్లు ఉంటాయి. అయితే పృథ్వీషా ఖాతాలో మరో రికార్డు నమోదవుతుందా..?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వాళ్లంతా రాణిస్తారనే గ్యారంటీ లేదు. కానీ కొందరు మాత్రం సక్సెస్ సాధిస్తారు. ఇపుడు క్రికెటర్ పృథ్వీషా ఆడుతున్న స్టయిల్ను చూస్తే.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా స్టేడియంలో అదరగొడుతున్నాడు.అతను కొడుతున్న షాట్లకు మాజీ క్రికెటర్లే కాదు.. క్రికెట్ అభిమాలనులంతా వావ్ అంటున్నారు. పృథ్వీ షా చిచ్చరపిడుగులా చెలరేగుతున్న తీరు గురించి అందరూ చర్చిస్తుంటే.. అతను ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు. ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు. ఆ ఘనత సాధించిన 15వ భారత క్రికెటర్గా నిలిచిన యువ సంచలనం పృథ్వీ షాకి.. హైదరా బాద్లో వెస్టిండీస్తో జరగనున్న రెండో టెస్టు మ్యాచులో మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉన్నది. ఇక ఆడిన తొలి మ్యాచుల్లోనే ఇప్పటివరకూ మొత్తం 15 మంది భారత బ్యాట్స్మెన్ శతకాలు నమోదు చేశారు. వారిలో ముగ్గురు వరుసగా రెండో మ్యాచులోనూ సెంచరీ కొట్టారు. వారిలో.. సౌరవ్ గంగూలీ, అజహరుద్దీన్, రోహిత్ శర్మ ఉన్నారు. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం(12న) హైదరాబాద్లో జరగనున్న రెండో టెస్టు మ్యాచులోనూ పృథ్వీ షా తన మొదటి మ్యాచులో రాణించినట్టు.. మరోసారి చిచ్చరపిడుగులా చెలరేగి శతకం బాదితే ముగ్గురు సీనియర్ల సరసన నిలుస్తాడని క్రీడాభిమానులు అంటున్నారు.
కాగా..ఈ రికార్డును హైదరాబాదీ అజహర్ 1984లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో నెలకొల్పాడు. ఆ తర్వాత 1996లో అదే జట్టుతో ఆడిన టెస్టు సిరీస్లో గంగూలీ ఈ రికార్డు సాధించాడు. 2013లో వెస్టిండీస్తో కోల్కతాలో జరిగిన మొదటి టెస్టు మ్యాచు ద్వారా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఆ మ్యాచులో శతకం సాధించాడు. ముంబయిలో జరిగిన రెండో టెస్టు మ్యాచులోనూ శతకం బాదాడు. ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలోకి ఎక్కాడు. 12న వెస్టిండీస్తో జరిగే మ్యాచులో పృథ్వీ షా శతకం బాదితే ఈ రికార్డును అందుకునే ఛాన్స్ ఉన్నది. అయితే ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ బాదిన క్రికెటర్గా.. షా ప్రపంచంలో ఆ ఘనత సాధించిన 104వ బ్యాట్స్ మెన్గా నిలిచాడు