Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖవాజా, పైనె అసమాన పోరాటం
- పాక్తో తొలి టెస్టు డ్రా
దుబాయ్ : ఆసియాలో ఓ విదేశీ జట్టు ఆఖరి రోజు 7 వికెట్లు నిలుపుకోవటం సాధారణ విషయం కాదు. చివరి రోజు స్పిన్ మాయ జోరుగా సాగుతున్న వేళ కంగారు పడని ఆసీస్ బ్యాట్స్మెన్ ఉండకపోవచ్చు!. అదీ స్టార్ క్రికెటర్లు లేని వేళ, కొత్త రూపుతో యు.ఏ.ఈకి వచ్చిన ఆస్ట్రేలియాకు ఇది అసాధ్యమనే చెప్పాలి. కానీ టిమ్ పైనె జట్టు అద్భుతం చేసింది. ఆసియాలో సుదీర్ఘ నాల్గో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టుగా నిలిచింది. పాకిస్థాన్తో తొలి టెస్టును డ్రాగా ముగించింది. ఉస్మాన్ ఖవాజా (141, 302 బంతుల్లో 11 ఫోర్లు) ఆసియాలో తొలి సెంచరీ సాధించగా, ట్రావిస్ హెడ్ (72, 175 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ టిమ్ పైనె ( 61 నాటౌట్, 194 బంతుల్లో 5 ఫోర్లు) అసమాన పోరాటం చేశారు. ఓవర్నైట్ స్కోరు 136/3తో ఐదో రోజు బ్యాటింగ్కు వచ్చిన ఆస్రే ్టలియా 362/8తో చివరి రోజు చివరి సెషన్ను ముగిం చింది. ఖవాజా గొప్ప పోరాట పటిమ ప్రదర్శించగా, కెప్టెన్ పైనె 194 బంతులు ఎదుర్కొని ఓటమికి అడ్డుగా నిలి చాడు. చివరి గంటలో వరుస వికెట్లతో పాకిస్థాన్ రేసులోకి వచ్చింది. 333/8తో ఉండగా పాక్ విజయంపై ఆశలు పెట్టుకున్నది. ఆఖర్లో మరో 12 ఓవర్ల పాటు వికెట్లు నిలు పుకున్న ఆసీస్ డ్రాతో గట్టెక్కింది. తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా.. నాల్గో ఇన్నింగ్స్లో 462 పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగింది. పాకి స్థాన్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగుల భారీ స్కోరు సాధిం చింది, రెండో ఇన్నింగ్స్ను 181/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో విలువైన శతకం సాధించిన ఉస్మాన్ ఖవాజా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.