Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ..20 వరల్డ్కప్ నుంచి అమలు
- లైంగికవేధింపులకు వ్యతిరేకంగా సురక్ష చర్యలపై ఐసీసీ కసరత్తు
న్యూఢిల్లీ: మీటూ క్యాంపెన్తో క్రీడల్లోనూ మహిళల భద్రత అంశం హాట్ టాపిక్ మారింది. ఉన్నతపదవులు వచ్చాక..వారి నుంచి లైంగికవేధింపులు ఎక్కువ వుతున్నాయన్న వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు మీటూ వేదికగా తమపై జరిగిన వేధింపులను సామాజిక మాథ్యమాల్లో బయటపెట్టారు. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి ప్రారంభం కానున్న మహిళల టీ..20 వరల్డ్ కప్ కన్నా ముందుగా మహిళాక్రికెటర్ల భద్రత,దిశ మార్గదర్శకం చేసేలా ఓ పాలసీ తీసుకురావాలని బుధవారం ఇక్కడ జరిగిన ఐసీసీ సమావేశం నిర్ణయించింది. పకడ్బందీగా మహిళా క్రికెటర్లకు రక్షణ కల్పించేదిశగా అడుగులు వేయాలని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
క్రికెటర్స్, ఆఫీసర్స్ బేరర్స్పై ఆరోపణలు..
1. సింగపూర్లో మూడురోజులపాటు జరిగే ఐసీసీ సమావేశంలో లైంగికవేధింపులకు వ్యతిరేకంగా రూపకల్పన చేసే కొత్త పాలసీపై చర్చించనున్నారు.
2. గత 18 నెలల్లో ఐసీసీ నిర్వహించే టోర్నీలు, అంత ర్జాతీయ మ్యాచులు,వరల్డ్ కప్ మ్యాచుల్లో మహిళలపై లైంగికవేధింపులకు గురైన మహిళలు, అనర్హులను రాంగ్రూట్లో ఎంపిక లాంటి నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సత్వరమే ఓ పాలసీ తేవాలని ఐసీసీ భావిస్తోంది.
3. మీటూ క్యాంపెన్లో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జౌహరీ,శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ,బౌలర్ లసిత్ మలింగపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూశాయి.