Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య, ప్రియురాళ్లను తీసుకెళ్లొచ్చు
- కోహ్లి కోరికకు బీసీసీఐ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: గతంలో ఆటగాళ్లు మాత్రమే విదేశీ పర్యటనలకు వెళ్లేవారు. ఎన్నో రోజులపాటు దూరంగా ఆడి..దేశానికి ఆ క్రికెటర్ తిరిగివస్తే ఆ కుటుంబసభ్యుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఆటతీరు మారింది. కెప్టెన్ ఏదంటే దాన్ని ఒప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆట కాదు. వారి కోరికలు తీర్చటమే మా పని అన్నట్టుగా బీసీసీఐ తీరుకూడా మారింది. తాజాగా టీమిండియా విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల భాగస్వాములను లేదా వారి ప్రియురాళ్లను అనుమతించాలని కొహ్లీ చేసిన అభ్యర్థించాడు. అందుకు బీసీసీఐ కూడా అంగీకరించినట్టు తెలిసింది. దీర్ఘ కాలిక పర్యటనలు ఉన్న సమయంలో మొదటి పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట తమ జీవిత భాగస్వాములు, వ్యక్తిగత సిబ్బందిని రెండు వారాలపాటే అనుమతిస్తున్నారు. అయితే ఈ నిబంధనలను మార్చాలని.. విదేశీ పర్యటన పూర్తికాలం జీవితభాగస్వాములను తమతో అనుమతించాలని ఇటీవల కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్ రవిశాస్త్రి, కొహ్లీ, రోహిత్ శర్మను పాలకుల కమిటీ వెస్టిండీస్తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించింది. ఆటగాళ్ల వెంట జీవితభాగస్వాములను, ప్రియురాళ్లను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు అంటున్నాయి. ఆటగాళ్ల పర్యటనలకు భారీగా నిధులు ఖర్చుపెడుతుంటే..మరి వారి వెంట అనుమతించేవారి ఖర్చులు ఎవరు భరిస్తారని సామాన్య క్రీడాభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న.