Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ్హజారే ట్రోఫీ సెమీస్లో హైదరాబాద్పై గెలుపు
బెంగళూరు: విజయ్హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ముంబయిజట్టు 60 పరుగుల తేడాతో హైదరాబాద్పై గెల్చింది. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన పోటీలో తొలిగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు 121 పరుగులు చేయగా... సందీప్ 29 పరుగులు చేశాడు. ఆ జట్టు కెప్టెన్ అంబటి రాయుడు కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దేశ్పాండేకు మూడు, డియాస్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ముంబయి జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన అనంతరం భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో అంపైర్లు విజెడి పద్ధతిపై ముంబయి 60 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. పృథ్వీ షా 61, శ్రేయస్ అయ్యర్ అజేయంగా 55 పరుగులతో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దేశ్పాండేకు లభించింది. ఢిల్లీ-జార్ఖండ్ జట్ల మధ్య శుక్రవారం జరిగే రెండో సెమీస్ విజేతతో 20న టైటిల్కై ముంబయి తలపడనుంది.