Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి × ఢిల్లీ
బెంగళూరు : విజయ్హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముంబయి-ఢిల్లీ జట్ల మధ్య శనివారం జరగనుంది. సెప్టెంబర్ 9న అట్టహాసంగా ప్రారంభమైన జాతీయస్థాయి వన్డే టోర్నీ నేడు జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. తొలి సెమీస్లో ముంబయి జట్టు హైదరాబాద్ను 60 పరుగుల తేడాతో ఓడించగా... రెండో సెమీస్లో ఢిల్లీజట్టు జార్ఖండ్పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ముంబయి జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండగా... ఢిల్లీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్గా వహిస్తున్నాడు.