Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ
- తొలిమ్యాచ్లో ఒమన్పై 11-0 గోల్స్ తేడాతో భారత్ గెలుపు
మస్కట్ : భారత పురుషుల హాకీ జట్టు నేడు దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. గురువారం జరిగిన తొలిమ్యాచ్లో ఆతిథ్య ఓమన్ను 11-0 గోల్స్ తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. యువ ఆటగాడు దిల్ప్రీత్సింగ్ ఓమన్తో మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్తో రాణించాడు. పెనాల్టీ కార్నర్లను ఐదు గోల్స్గా మలిచి టోర్నీలో భారత్ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారతజట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇరుజట్లు ఈ ఏడాది ఆసియా క్రీడల సెమీఫైనల్లో తలపడగా 2-1 గోల్స్ తేడాతో భారత్ గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.