Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేపు వెస్టిండీస్తో తొలి వన్డే
గువహతి : ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేను ఆదివారం ఆడనున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గువహతి చేసుకున్న భారత ఆటగాళ్లు శుక్రవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోని, కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ తదితరులు కఠోర ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆసియాకప్ టోర్నీకి విరామం తీసుకున్న విరాట్ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేసి టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబరు 21న జరిగే తొలి వన్డేకు 14మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణమండలి(బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించింది. అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన యువ ఆటగాడు రిషబ్ పంత్ ఈసారి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అంతేగాక ఓపెనర్గా వన్డేల్లోనూ సత్తా చాటేందుకు పృథ్వీ షా సైతం రేసులో నిలిచాడు. వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో 184 పరుగులు చేసిన పంత్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు తొలి వన్డేలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ తొలి రెండు వన్డేలకు దూరం కావడంతో అతని స్థానంలో ఉమేష్ యాదవ్ను 14మంది సభ్యుల జాబితాలో వచ్చి చేరాడు. తొలి వన్డే గౌహతిలో జరగనుండగా... రెండోవన్డే విశాఖపట్నంలో జరగనున్న సంగతి తెలిసిందే.