Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్ణయం
దుబాయ్ : 2015లో అసోసియేట్ దేశాల ఆకట్టుకునే ప్రదర్శనతో 2019లో కచ్చితంగా ప్రపంచకప్లో పాల్గొనే దేశాల సంఖ్య పెరుగుతుందనే భావన వ్యక్తమైంది. కానీ అందుకు భిన్నంగా ఐసీసీ 2019 ప్రపంచకప్ను 10 దేశాల పోటీగా కుదించింది. దీంతో ఐసీసీ నిర్ణయం పట్ల అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా, 2023 క్రికెట్ ప్రపంచకప్ విషయంలో ఐసీసీ తీరు మారలేదు. 2023 ప్రపంచకప్ను సైతం పది దేశాలతోనే సరిపెట్టేందుకు నిర్ణయించింది. సింగపూర్లో సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. ప్రపంచకప్ నిమిత్తం ఐసీసీ రూపొందిన నూతన రోడ్ మ్యాప్ ప్రకారం అసోసియేట్ సభ్య దేశాలు ఎక్కువ వన్డేలు ఆడనున్నాయి. ప్రపంచకప్ అర్హతను మూడెంచల విధానంలో నిర్ణయించనున్నారు. దీని ప్రకారం 37 దేశాలు జులై 2019 నుంచి 2022 వరకు 372 మ్యాచులు ఆడనున్నాయి.