Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజరు హజాయ్ ట్రోఫీ సొంతం
- రాణించిన ఆదిత్య తారె
బెంగళూర్ : దేశవాళీ వన్డే ట్రోఫీ ముంబయి సొంతమైంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజరు హజారే ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన ముంబయి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని ముంబయి బౌలర్లు 177 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్లు ధవల్ కులకర్ణి (3/30), శివం దుబె (3/29) ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఢిల్లీ ఆటగాళ్లు ఉన్ముక్త్ చంద్ (13), కెప్టెన్ గౌతం గంభీర్ (1), నితీశ్ రానా (13)లు విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్లో హిమ్మత్ సింగ్ (41), పవన్ నేగీ (21), సుబోత్ భాటి (25) ఢిల్లీకి గౌరవప్రద స్కోరు అందించారు. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు పృథ్వీ షా (8), అజింక్య రహానె (10) విఫలమైనా ముంబయి ఒత్తిడికి గురి కాలేదు. ఆదిత్య తారె (71), సిద్దేశ్ లాడ్ (48) రాణించటంతో ముంబయి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదిత్య తారె 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.