Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నేటి నుంచి దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ : ప్రపంచకప్ కౌంట్డౌన్ మొదలైంది. మెగా ఈవెంట్కు టీమ్ ఇండియా మరో 17 వన్డేల దూరంలోనే ఉంది. విండీస్ వన్డే సిరీస్ తర్వాత సమీకరణం 13 వన్డేలకు తగ్గనున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న సీనియర్ ఆటగాళ్లు ఫామ్ నిరూపణకు దేవధర్ ట్రోఫీపై ఆశలు పెట్టుకున్నారు. యువ కెరటం పృథ్వీ షా ప్రదర్శనపై అందరి చూపులు నెలకొన్నా.. తామూ రేసులో ఉన్నామంటూ అజింక్య రహానె, అశ్విన్, దినేశ్ కార్తీక్లు పోటీపడుతున్నారు. మిడిల్ ఆర్డర్ కూర్పు ఇంకా కుదరలేదు. అంబటి రాయుడు సరైనోడు అంటున్నారు కానీ అతడినీ పూర్తిగా పరీక్షించాల్సి ఉంది. దీంతో దేవధర్ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావాలని రహానె భావిస్తున్నాడు. వన్డే జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్టు కనిపిస్తోన్నా, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇంకా పట్టుదలగానే కనిపిస్తున్నాడు. జడేజా మాదిరిగానే తనూ మళ్లీ రాగలనని నమ్మకంగా ఉన్నాడు. పేలవ ప్రదర్శన చేయకపోయినా, రిషబ్ పంత్ బాగా ఆడుతున్న కారణంగా దినేశ్ కార్తీక్పై వేటు పడింది. ఇక్కడ రాణించి సెలక్టర్ల మెప్పు పొందాలని కార్తీక్ భావిస్తున్నాడు. ఇండియా ఏ, బి, సి జట్లు పోటీపడుతున్న దేవధర్ ట్రోఫీ నేటి నుంచి ఢిల్లీలో జరుగనున్నది. ఎ జట్టుకు దినేశ్ కార్తీక్, బి జట్టుకు శ్రేయాష్ అయ్యర్, సి జట్టుకు అజింక్య రహానె సారథ్యం వహించనున్నారు. విజరు హజారే ట్రోఫీ చాంపియన్ ముంబయి ఈ సారి పోటీలో లేదు.