Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దినేశ్ కార్తీక్ పోరాటం వృథా
- ఇండియా-ఎపై బి గెలుపు
న్యూఢిల్లీ : తెలుగు తేజం హనుమ విహారి (87 నాటౌట్, 95 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించటంతో దేవధర్ ట్రోఫీలో ఇండియా-బి శుభారంభం చేసింది. మంగళవారం ఇండియా-బితో జరిగిన మ్యాచ్లో హనుమ విహారి మెరవటంతో ఇండియా-బి 43 పరుగుల తేడాతో అలవోక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి నిర్ణీత ఓవర్లలో 261/8 పరుగులు చేసింది. విహారికి తోడు మయాంక అగర్వాల్ (46), శ్రేయాష్ అయ్యర్ (41) సహా మనోజ్ తివారి (52) రాణించారు. ఛేదనలో ఇండియా-ఎ అంచనాలను అందుకోలేదు. యువ కెరటం పృథ్వీ షా మరో మ్యాచ్లో విఫలమయ్యాడు. విజరు హజారే ట్రోఫీ ఫైనల్లో పది పరుగులు దాటని షా, ఇక్కడా ఏడు పరుగులకే వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (99, 114 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. లోయర్ ఆర్డర్లో అశ్విన్ (54) అర్ధ సెంచరీతో పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇండియా బి బౌలర్లు మార్కండే (4/48), నదీమ్ (3/32), వరుణ్ అరోన్ (2/45) నిప్పులు చెరగటంతో ఇండియా ఎ 218 పరుగులకే కుప్పకూలింది.