Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్పై భారత్ విజయం
- మహిళల టీ20 ప్రపంచకప్
గుయాన : ప్రపంచకప్లో భారత మహిళల జట్టు నాకౌట్ బెర్త్కు చేరువైంది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా టోర్నీలో అదరగొ డుతోంది. దిగ్గజ బ్యాట్స్మన్ మిథాలీ రాజ్ (56, 47 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కగా ఛేదనలో టీమ్ ఇండియా మరో ఆరు బంతులుండగానే విజయం సాధించింది. 134 పరుగుల ఛేదనలో మిథాలీ (56), స్మృతి మంధాన (26)లు తొలి వికెట్కు 73 పరుగులు జోడించి గెలుపు లాంఛనం చేశారు. యువ బ్యాట్స్మన్ జెమీమా రొడ్రిగస్ (16), హర్మన్ప్రీత్ కౌర్ (14) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 133/7 పరుగులు చేసింది. స్పిన్నర్లు పూనమ్ (2/22), హేమలత (2/34) చెలరేగారు. పాకిస్తాన్ తరఫున బిస్మా మరూఫ్ (53), నిదా దార్ (52) అర్ధ సెంచరీలతో రాణించినా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయలేకపో యింది. మిథాలీ రాజ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది.