Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్పై సింధు గురి
- బరిలో నిలిచిన సైనా, శ్రీకాంత్
- నేటి నుంచే హాంగ్కాంగ్ ఓపెన్
హాంగ్కాంగ్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసినా, ఒక్క టోర్నీలోనూ విజేతగా నిలువలేదు. కామన్వెల్త్, ఆసియా సహా వరల్డ్ చాంపియన్షిప్స్లో రజత పతకాలు సాధించిన సింధు సీజన్ తొలి గోల్డ్ కోసం నిరీక్షిస్తోంది. కిందటేడు టైటిల్ పోరులో వరల్డ్ నం.1 తైజు యింగ్ చేతిలో కంగుతిన్న సింధు.. ఈ సారి మరోసారి టైటిల్పై కన్నేసింది. నేటి నుంచి ఆరంభం కానున్న హాంగ్కాంగ్ ఓపెన్లో పి.వి సింధు మహిళల సింగిల్స్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్లో థారులాండ్ షట్లర్ నిచోన్ జిందపాల్తో సింధు తలపడనున్నది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లోనే కఠిన పరీక్ష ఎదురు కానున్నది. జపాన్ స్టార్ షట్లర్, రెండో సీడ్ అకానె యమగూచితో సైనా తొలి ఫైట్ చేయనున్నది. జర్మనీ ఓపెన్లో యమగూచిపై అలవోక విజయం సాధించిన సైనా.. ఇక్కడా అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆశిస్తోంది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరులు రెండో రౌండ్లో ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. వాంగ్ వింగ్ కి విన్సెంట్తో శ్రీకాంత్, అంటోన్సెన్తో ప్రణరులు తొలి రౌండ్లో పోటీపడనున్నారు. ఈ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న సమీర్ వర్మ సైతం హాంగ్కాంగ్ ఆశల బరిలో నిలిచాడు. బి. సాయిప్రణీత్ ఈ ఏడాది చెప్పుకోదగిన విజయాలు సాధించలేదు. హాంగ్కాంగ్ ఓపెన్ ఆ లోటు తీర్చుతుందనే ఆశల పల్లకిలో ప్రణీత్ కనిపిస్తున్నాడు. డబుల్స్ సర్క్యూట్లో మను అత్రి, సుమిత్ రెడ్డి సహా సాత్విక్, చిరాగ్లు సైతం మంచి ఫామ్లో ఉన్నారు. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్పలు మెరుగైన ప్రదర్శన చేయాలని తపిస్తున్నారు. మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్పతో కలిసి సాత్విక్సాయి మరో మెరుపు ప్రదర్శన చేసేందుకు ఎదురుచూస్తున్నాడు.