Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్ 522/7 డిక్లేర్డ్
ఢాకా : బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ ముష్ఫీకర్ రహీం (219 నాటౌట్, 421బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జింబాబ్వేతో రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ముష్ఫీకర్ కెరీర్ తొలి డబుల్ సెంచరీ బాదాడు. 18 ఫోర్లు, ఓ సిక్సర్తో అజేయంగా 219 పరుగులు చేశాడు. ముష్ఫీకర్కు తోడు మెహిది హసన్ (68) రాణించటంతో తొలి ఇన్నింగ్స్ను బంగ్లా 522/7 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. రెండో రోజు ఆఖర్లో 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 25/1తో కొనసాగుతోంది. చారి (10), డొనాల్ (0)లు క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో బంగ్లాదేశ్పై జింబాబ్వే మెరుపు విజయం సాధించిన సంగతి తెలిసిందే.