Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతీయ ఆర్చరీ కోచ్ జీవన్జోత్ సింగ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు స్పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా (సారు) ఉపకమ్రిస్తోంది. ఈ ఏడాది ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన జాబితాలో ఆర్చరీ కోచ్ జీవన్జోత్ సింగ్ సైతం ఉన్నారు. కానీ 2015లో కొరియాలో జరిగిన వరల్డ్ యూనివర్శడ్లో కాంపౌండ్ ఆర్చరీ జట్టు కాంస్య పోరుకు భారత జట్టు ఆలస్యంగా వెళ్లి, అనర్హత వేటుకు గురైంది. అప్పుడు ఆ జట్టుకు చీఫ్ కోచ్ జీవన్జోత్. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య అప్పట్లో జీవన్జోత్పై మూడేండ్ల నిషేధం విధించి, తర్వాత కుదించింది. భారత ఆర్చరీ సంఘం విడిగా మరో ఏడాది నిషేధం విధించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న క్రీడా మంత్రిత్వ శాఖ జీవన్జోత్ సింగ్ పేరును ద్రోణాచార్య అవార్డు జాబితా నుంచి తప్పించింది. క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై అప్పట్లో జీవన్జోత్ బాహాటంగానే విమర్శలు చేశారు. హైకోర్టుకు వెళతానని సైతం హెచ్చరించగా, కొందరు ఆర్చర్లు మంత్రి రాజ్యవర్థన్ సింగ్ చాంబర్ ముందు నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 29-30న టర్కీలో ఆర్చరీ ప్రపంచకప్కు జీవన్జోత్ సింగ్ కాంపౌండ్ జట్టుకు చీఫ్ కోచ్గా వెళ్లాల్సి ఉన్నది. కానీ క్రీడా శాఖ ద్రోణాచార్య పురస్కార నిరాకరించటంతో సెప్టెంబర్ 22న జీవన్జోత్ తన పదవికి రాజీనామా చేశాడు. జీవన్జోత్ ఆకస్మిక నిర్ణయంతో కోచ్ లేకుండా భారత జట్టు టర్కీకి వెళ్లింది. క్రీడా మంత్రిత్వ శాఖపై బహిరంగ విమర్శలు, న్యాయస్థానానికి వెళతానని బెదిరించటం వంటి విషయాలపై జీవన్జోత్పై తీవ్ర క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశాన్ని సారు పరిశీలిస్తోంది. ఇదే సమయంలో టర్కీలో ప్రపంచకప్ కోసం అతడి కోసం ముందుగా బుక్ చేసిన హోటల్ గది బిల్లు, విమాన చార్జీలను అతడి నుంచే వసూలు చేయాలనే అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.