Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ 523/7
తిరునవెలి : తమిళనాడుతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ అక్షత్ రెడ్డి (248 నాటౌట్, 477 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిల్ ఆర్డర్లో సందీప్ (130, 221 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సైతం శతకంతో మెరవటంతో తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 523/7తో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన అక్షత్ రెడ్డి రెండు రోజుల పాటు అజేయంగా ఆడుతున్నాడు. నేడు ఓవర్నైట్ డిక్లరేషన్ ప్రకటించి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాయింట్లు పొందాలని హైదరాబాద్ భావిస్తోంది.