Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి నుంచి మహిళల ప్రపంచ
బాక్సింగ్ చాంపియన్షిప్స్
న్యూఢిల్లీ : 72 దేశాలు, 300 మంది బాక్సర్లు, స్వదేశీ పతక ఆశలతో న్యూఢిల్లీ మెగా బాక్సింగ్ ఈవెంట్కు ముస్తాబైంది. నేడు మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ న్యూఢిల్లీలో ఆరంభం కానున్నది. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ మరో స్వర్ణంపై కన్నేసి బాక్సింగ్ రింగ్లోకి దూకనున్నది. 2006లోనూ మహిళల చాంపియన్షిప్స్కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ అప్పుడు 4 స్వర్ణాలు, ఓ సిల్వర్, 3 కాంస్యాలు సహా 8 పతకాలు సాధించింది. ప్రస్తుత టోర్నీలో భారత్ నుంచి పది మంది బాక్సర్లు బరిలోకి నిలిచారు. 48 కేజీల విభాగంలో పోటీపడుతున్న మేరీకోమ్కు ఇప్పుడు 35 ఏండ్లు. ఈ విభాగంలో మేరీకి కఠిన ప్రత్యర్థులు ఎదురు కానున్నా, ఆమే ఫేవరేట్గా నిలుస్తోంది. ఎల్ సరితా దేవి, పింకి జాంగ్రా, మనీషా, సోనియా, సిమ్రన్జిత్ కౌర్, లవ్లినా, స్వీటీ బూరా, కచారి, సీమ పూనియాలు భారత్ తరఫున పంచ్ విసరనున్నారు.