Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మిత్, వార్నర్ లేని ఆసీస్.. కోహ్లి, రోహిత్ భారత్ వంటిదే
- భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్య
కోల్కత : ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయానికి ఇదే అనువైన సమయం అని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ విలేకరులతో ముచ్చటించారు. ' స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టు అంటే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని భారత జట్టు వంటిదే. సిరీస్లో ఇదే అతిపెద్ద వ్యత్యాసం' అని దాదా పేర్కొన్నాడు. భారత క్రికెట్కు ఇది గొప్ప అవకాశం. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడిచేందుకు ఇది సరైన సమయం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో భారత సీమర్ల ప్రదర్శన అమోఘం. ప్రతి మ్యాచ్లోనూ 20 వికెట్లు కూల్చగల సత్తా బౌలర్లుకుంది. కానీ సొంతగడ్డపై కంగారూ భిన్నమైన జట్టు. స్వదేశంలో ఆజట్టుతో ఎప్పుడూ ప్రమాదమేనని దాదా వ్యాఖ్యానించాడు.