Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య
- ఆసీస్కు బయల్దేరనున్న టీమ్ ఇండియా
ముంబయి : 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే భారత క్రికెట్లో పెను మార్పు చోటుచేసుకున్నది. మిస్టర్ జెంటిల్మన్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ' కెప్టెన్ విరాట్ కోహ్లికి తన శిక్షణ శైలిపై, కోచ్గా కొనసాగటంపై అభ్యంతరాలు ఉన్నాయని సీవోఏ ద్వారా తెలిసింది. విరాట్తో సంబంధాలు అతికించలేని స్థాయికి చేరుకున్నాయని' కుంబ్లే కోచ్గా తప్పుకున్నాడు. టీమ్ డైరెక్టర్గా పనిచేసిన రవిశాస్త్రి.. ఓ ఏడాది విరామ తర్వాత చీఫ్ కోచ్గా భారత జట్టులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో కోహ్లిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో యువ జట్టుకు పబ్లు, పార్టీలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ క్రీడా సంస్కృతి నాశనం చేస్తున్నాడని నెటిజన్లు విరుచుకుపడ్డారు. కెప్టెన్ కోహ్లికి భిన్న వాదనలు నచ్చవని, కోహ్లి చెప్పినట్టు శాస్త్రి ఎస్ అనేస్తాడని తేల్చేశారు. ఇదే విషయాన్ని కోహ్లి వద్ద ప్రస్తావించగా విరాట్ భిన్నమైన కథ చెప్పాడు!. ' ఎల్లవేళలా ఎస్ చెప్పే విషయంలో.. అత్యంత విలక్షణ వ్యాఖ్యలను విన్నాను. భారత క్రికెట్లో రవిశాస్త్రి చెప్పినన్ని సార్లు మరెవరూ నాకు 'నో' చెప్పలేదు. నేను మాట్లాడి నిజాయితీతో కూడిన సలహా పొందేది శాస్త్రి దగ్గర నుంచే. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎక్కువ సార్లు చెప్పింది రవిశాస్త్రి మాత్రమే. భారత క్రికెట్లో ఎవ్వరూ నాకు ఇన్ని నో లు చెప్పలేదు' అని కోహ్లి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో నవంబర్ 21 నుంచి ఆరంభం కానున్న సుదీర్ఘ పర్యటనకు ముందు ముంబయిలో కోచ్ రవిశాస్త్రితో కలిసి విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. నేడు ఉదయం కోహ్లిసేన ముంబయి నుంచి ఆడిలైడ్కు బయల్దేరి వెళ్లనున్నది.
ఫామ్లో లేని వేళ స్ఫూర్తి నింపాడు : చీఫ్ కోచ్ రవిశాస్త్రి మానసికంగా ఎంతో ప్రభావం చూపాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటన చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడ్డాను. అదే విధంగా 2015 వరల్డ్కప్ వైఫల్యం నుంచి శిఖర్ ధావన్ ఇబ్బంది పడ్డాడు. ఇలా జట్టులో ఫామ్లో లేని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి, పరుగుల ప్రవాహం పారించే దిశగా స్ఫూర్తి నింపాడు. అంతర్జాతీయ స్థాయిలో మానవ వనరుల వినియోగం అత్యంత కీలకం. ఈ విషయంలో రవిశాస్త్రి అద్భుతమైన నిర్వహణ చూపించాడు. ఇక మిగతా విషయాల్లో ఇతరులకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ జట్టుగా మేము సవ్యదశలో, సానుకూల దృక్పథంతో, ప్రగతి పథంలోనే వెళ్తున్నాం. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడమే మా ముందున్న కర్తవ్యం. అందులో మాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. నేను, రవిశాస్త్రి ఎదో రోజు ఆటకు దూరం కావాల్సిందే. కానీ భారత క్రికెట్ ముందుకు సాగేందుకు మా వంతు పని చేస్తున్నాం. ఇక్కడ ఎవరు ఎవరిపై ఆధిపత్యం చూపించేది లేదు, దీని నుంచి ఏదో సాధించేది లేదని విమర్శలకు కోహ్లి దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.
బ్యాట్స్మన్ బాధ్యత తీసుకోవాలి : ఇంగ్లాండ్ పర్యటన తర్వా త జట్టు సమావేశంలో అన్ని అంశాలు చర్చించాం. మెరుగైన క్రికెట్ కనబర్చినా ఫలితం ఎందుకు రాలేదు అనే విషయంపై విశ్లే షించు కున్నాం. ఇంగ్లాండ్లో ఎంత మెరుగైన ప్రదర్శన చేశామో, పొర పాటు సైతం అంతే తీవ్ర స్థాయిలో చేశామని ఆత్మ పరిశీలన చేసు కున్నాం. ప్రతి టెస్టులోనూ 20 వికెట్లు కూల్చగల సత్తా భారత బౌల ర్లుకు ఉంది. బ్యాట్స్మన్ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. అందు కు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లాండ్లో చేసిన పొర పాట్లను సరిదిద్దకుని, పునరావృతం చేయం. ఇంగ్లాండ్ ఓటమి ప్రభావం ఆసీస్ పర్యటనపై ఉండబోదని కోహ్లి ఆత్మవిశ్వాసం వెలిబుచ్చాడు.