Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో ఓడిన తెలుగు తేజం
- క్వార్టర్స్కు చేరిన శ్రీకాంత్, సమీర్ వర్మ
- హాంగ్కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్
హాంగ్కాంగ్ : భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు సీజన్ తొలి టైటిల్ ఆశలకు మరోసారి ఆరంభంలోనే తెరపడింది. ఆసియా, కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్షిప్స్లో రజతాలు సాధించినా, ఈ సీజన్లో సింధుకు తొలి టైటిల్ దక్కలేదు. జిందపాల్పై విజయంతో హాంగ్కాంగ్ ఓపెన్ను ఘనంగా ఆరంభించిన సింధుకు ప్రీ క్వార్టర్స్లోనే చుక్కెదురైంది. వరల్డ్ నం.2 సంగ్ జీ హ్యూన్ (కొరియా) చేతిలో సింధు వరుస గేముల్లో ఓటమిపాలైంది. టైబ్రేకర్కు దారితీసిన రెండు గేముల్లోనూ 24-26, 20-22తో సింధు పోరాడి ఓడింది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఓడటంతో మహిళల సింగిల్స్లో భారత్ టైటిల్ వేటకు తెరపడింది. పురుషుల సింగిల్స్లో వరల్డ్ నం.9 కిదాంబి శ్రీకాంత్ జోరందుకున్నాడు. సహచర షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుపై 18-21, 30-29, 21-18తో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. మరో మ్యాచ్లో సమీర్ వర్మకు వాకోవర్ లభించింది. చైనా దిగ్గజం చెన్ లాంగ్ పోటీ నుంచి తప్పుకోగా శ్రీకాంత్తో పాటు సమీర్ సైతం క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్లో మను అట్రి, సుమిత్ రెడ్డి జోడి పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. 16-21, 15-21తో చైనీస్ తైపీ జోడి చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్, అశ్విని పొన్నప్పల జంట 17-21, 11-21తో చైనీస్ తైపీ జోడి చేతిలో ఓటమిపాలైంది.