Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో తేలనున్న జోహ్రి భవితవ్యం
ముంబయి : 'మీటూ' ఉద్యమంలో భాగంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిపై బోర్డు దర్యాప్తు కమిటీ విచారణ పూర్తి చేసింది. అలహాబాద్ మాజీ న్యాయమూర్తి రిటైర్డ్ జస్టిస్ రాకేశ్ శర్మ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ బార్కా సింగ్, మానవ హక్కుల కార్యకర్త వీన గౌడ్లతో కూడిన త్రిసభ్య కమిటీ 15 రోజుల విచారణ ప్రక్రియను పూర్తి చేసింది. గురువారంతో విచారణ ముగిసింది. కానీ తుది నిర్ణయాన్ని వెలువరించేందుకు కమిటీ మరికొన్ని రోజుల గడువు కోరింది. అందుకు పాలకుల కమిటీ సమ్మతించినట్టు సమాచారం. విచారణలో భాగంగా వివరాలు బయటకు వెల్లడించని బాధిత మహిళా ఆన్లైన్లో స్కైప్ ద్వారా కమిటీ ముందు వాంగూల్మం ఇచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ జోహ్రి కమిటీ
ముందు బుధవారం, గురువారం సమారు 15 గంటల పాటు హాజ రయ్యారు. ఈ కేసులో ఆదిత్య వర్మ (బిహార్ క్రికెట్ సంఘం), బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, ముంబయి రంజీ మాజీ కెప్టెన్ శిశిర్లు కమిటీ ముందు హాజరై అవసరమైన సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణలో జొహ్రి దోషిగా తేలితే బీసీసీఐ సీఈవో పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది!.